Thursday 20 November 2014


2015 మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించనుంది.ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం డీఎస్సీ-2014 నోటిఫికేషన్‌ షెడ్యూలుని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంట్ 1,848, లాంగ్వేజ్ పండిట్స్ 812, పీఈటీ 156, ఎస్జీటీ 6,244 పోస్టులకు మంత్రి గంటా నోటిఫికేషన్ విడుదల చేశారు. డీఎస్సీ పరీక్షలు, ఎస్జీటీలకు మే 9న, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలకు మే 10, స్కూల్ అసిస్టెంట్ లకు మే 11న పరీక్షలు జరగనున్నాయి. డిసెంబర్ 2 నుంచి జనవరి 16వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫీజు చెల్లింపులు కూడా మీసేవ, ఆన్‌లైన్‌ ద్వారా చేసే అవకాశం వుంది. ఏప్రిల్ 25వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు జారీ చేసి, మే 18వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తారు. మే 27న ఫైనల్ కీ, మే 28న ఫలితాలు వెల్లడించనున్నారు.